ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

By

Published : Dec 16, 2019, 11:43 AM IST

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం, వ్యాను ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/15-December-2019/5384583_628_5384583_1576433803760.png
రామచంద్రపురం రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

రామచంద్రపురం రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం అసన్‌బాదాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం, వ్యాను ఢీ కొని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఘటనా స్థలంలోనే ఇద్దరు వ్యక్తులు చనిపోగా... మరో వ్యక్తి కాకినాడ జీజీహెచ్​కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. మృతులు కరప మండలం సిరిపురం గ్రామానికి చెందిన రుద్రప్రకాష్‌, రామరాజు, సూరిబాబులుగా పోలీసులు గుర్తించారు. బంధువుల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని తిరిగి సిరిపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details