గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వ అధికారులు..అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక వర్గానికి అండగా నిలిచారని ఓ అధికారిని అక్కడి గ్రామస్థులు నిర్బంధించారు . చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని రామచంద్రాపురం మండల అభివృద్ది అధికారి రాజశేఖరరెడ్డిని పీవీపురం గ్రామస్థులు నిర్బంధించారు. తొలి విడత ఎన్నికల్లో భాగంగా ఈ నెల తొమ్మిదిన పీవీపురం గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో భాస్కరరెడ్డి, టెండూల్కర్ పోటీపడగా... టెండూల్కర్ గెలుపొందారు. ఇందులో ఓ వర్గం వారికి సహకరించారని ..మరో వర్గీయులు ఎంపీడీఓని నిర్బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ..అతనిని విడిపించి గ్రామస్థులకు సర్ధిచెప్పారు.
23 గ్రామాలకు..28 నామినేషన్లు
చిత్తూరు జిల్లాలో నాలుగో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు పోటెత్తారు. తుది జాబితా విడుదల రోజు అవ్వడంతో ..ఎన్నికల బరిలో నిలిచేందుకు వెళ్లిన అభ్యర్థులతో కేంద్రాలు కిక్కిరిసిపోయాయి. నాలుగో దశలో 14 మండలాల పరిధిలోని 375 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మంత్రి పెద్దిరెడ్జి రామచంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని పులిచర్ల మండలంలో రెండో రోజు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. అతితక్కువ మంది నామినేషన్లు వేశారు. పులిచర్ల మండలంలో 23 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా కేవలం 28 మంది మాత్రమే నామినేషన్లు వేశారు.
160 గ్రామ పంచాయతీలకు 610 నామినేషన్లు
సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని 160 గ్రామ పంచాయతీలకు 610 నామినేషన్లు దాఖలయ్యాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 121 గ్రామ పంచాయతీలకు 462 చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రెండు మండలాల్లో 172, తిరుపతి గ్రామీణ పరిధిలో 34 మంది సర్పంచు అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
అక్కడి పంచాయతీ ఎన్నికలకు తెదేపా దూరం