తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా అనంతపురంలో తెదేపా నేతలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. లాక్ డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు తెదేపా 48వ డివిజన్ ఇంచార్జ్ స్వప్న నిత్యావసరాలతో పాటు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఎకనామికల్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ సంస్థ ఆధ్వర్యంలో శివారు ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలకు నిత్యావసర సరకులు అందించారు.