ETV Bharat / state

'రాజ్​తరుణ్​ నన్ను ప్రేమించి మోసం చేశాడు' - పోలీసులకు ప్రేయసి ఫిర్యాదు - Case on Hero Raj Tharun

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 5, 2024, 3:38 PM IST

A Case Registered Against Hero Raj Tharun : సినీనటుడు రాజ్​తరుణ్​పై నార్సింగి పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది. ప్రేమ పేరుతో తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

case_on_hero_raj_tharun
case_on_hero_raj_tharun (ETV Bharat)

Police Case on Hero Raj Tharun : సినీ నటుడు రాజ్​తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్​తరుణ్, తాను 2012 నుంచి రిలేషన్​లో ఉన్నామని, ఇటీవల అతడు మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్​తో సన్నిహితంగా ఉన్నట్లు తెలిసిందని పేర్కొంది. 'తిరగబడండ్రా సామి' అనే సినిమా షూటింగ్ జరిగినప్పటి నుంచి ఈ రిలేషన్ కొనసాగిస్తున్నట్లు తేలిందన్నారు. ఇదే విషయమై రాజ్​తరుణ్​ను నిలదీస్తే, తనను దుర్భాషలాడాడని ఫిర్యాదులో పేర్కొంది.

మాల్వి తండ్రి, సోదరుడు రాజ్​తరుణ్​ను వదిలేయాలని తనను బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. సంబంధం లేని కేసులో తనను ఇరికించారని, దాంతో తాను 43 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని తెలిపింది. కాగా లావణ్య ఇచ్చిన ఫిర్యాదును నార్సింగి పోలీసులు స్వీకరించారు. ఈ విషయంపై ఇన్​స్పెక్టర్ హరికృష్ట రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజ్​తరుణ్‌ తనను మోసం చేసి, మరో యువతితో సహజీవనం చేస్తున్నాడని లావణ్య ఫిర్యాదు చేశారన్నారు. తనపై బెదిరింపులకు దిగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై ఆధారాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఫిర్యాదు చేసిన లావణ్య గతంలో ఓ డ్రగ్స్ కేసులో నిందితురాలుగా ఉన్నట్లు వెల్లడించారు.

గోవా నుంచి తెచ్చి హైదరాబాద్​లో డ్రగ్స్ విక్రయం - రాజ్​తరుణ్ ప్రేయసి అరెస్ట్

Police Case on Hero Raj Tharun : సినీ నటుడు రాజ్​తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్​తరుణ్, తాను 2012 నుంచి రిలేషన్​లో ఉన్నామని, ఇటీవల అతడు మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్​తో సన్నిహితంగా ఉన్నట్లు తెలిసిందని పేర్కొంది. 'తిరగబడండ్రా సామి' అనే సినిమా షూటింగ్ జరిగినప్పటి నుంచి ఈ రిలేషన్ కొనసాగిస్తున్నట్లు తేలిందన్నారు. ఇదే విషయమై రాజ్​తరుణ్​ను నిలదీస్తే, తనను దుర్భాషలాడాడని ఫిర్యాదులో పేర్కొంది.

మాల్వి తండ్రి, సోదరుడు రాజ్​తరుణ్​ను వదిలేయాలని తనను బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. సంబంధం లేని కేసులో తనను ఇరికించారని, దాంతో తాను 43 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని తెలిపింది. కాగా లావణ్య ఇచ్చిన ఫిర్యాదును నార్సింగి పోలీసులు స్వీకరించారు. ఈ విషయంపై ఇన్​స్పెక్టర్ హరికృష్ట రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజ్​తరుణ్‌ తనను మోసం చేసి, మరో యువతితో సహజీవనం చేస్తున్నాడని లావణ్య ఫిర్యాదు చేశారన్నారు. తనపై బెదిరింపులకు దిగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై ఆధారాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఫిర్యాదు చేసిన లావణ్య గతంలో ఓ డ్రగ్స్ కేసులో నిందితురాలుగా ఉన్నట్లు వెల్లడించారు.

గోవా నుంచి తెచ్చి హైదరాబాద్​లో డ్రగ్స్ విక్రయం - రాజ్​తరుణ్ ప్రేయసి అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.