అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం పరిధిలో ఎస్ఈబీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఉరవకొండ పట్టణ శివారులో భారీగా కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నారు. 2,208 మద్యం టెట్రా ప్యాకెట్లు, రెండు ద్విచక్రవాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.