గ్రూప్-1 ప్రధాన పరీక్షలో ఇద్దరు అభ్యర్థులు మాల్ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో గురువారం పేపరు-2 పరీక్ష జరిగింది. హైదరాబాదులోని జేబీ ఇంజినీరింగ్ కళాశాలలో ఒకరు చిట్టీ ద్వారా కాపీయింగ్ చేస్తూ, మరొకరు సెల్ఫోన్ ద్వారా ప్రశ్నప్రత్రాన్ని స్క్రీన్షాట్ తీస్తుండగా సిబ్బంది సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నారు. వీరిపై పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. పరీక్షకు దరఖాస్తు చేసిన వారిలో 82.38 శాతం మంది పరీక్షకు హాజరు అయినట్లు అధికారులు వెల్లడించారు.