సంగారెడ్డి జిల్లాలో విషాదం - పొలంలో పత్తి విత్తనాలు వేస్తుండగా పిడుగుపడి మహిళ మృతి
Published : Jun 10, 2024, 10:17 PM IST
![సంగారెడ్డి జిల్లాలో విషాదం - పొలంలో పత్తి విత్తనాలు వేస్తుండగా పిడుగుపడి మహిళ మృతి Woman Died Due To Thunder Storm](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-06-2024/1200-675-21682085-thumbnail-16x9-thunder.jpg)
Woman Died Due To Thunder Storm In Sangareddy :రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం కోడూర్లో పిడుగు పాటుకు గురై యువతి మృతి చెందింది. పొలంలో పత్తి విత్తనాలు వేస్తుండగా ఉరుము, మెరుపులతో భారీ వర్షం కురవడంతో కూలీలు చెట్టు నీడకు వెళ్లి నిల్చున్నారు. చెట్టుపై పిడుగు పడి యాస్మిన్ బేగం అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. పిడుగు ధాటికి మరో మహిళ అనుష తీవ్రంగా గాయపడగా సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు.