Car Accident In Medchal Dist : మేడ్చల్ జిల్లా కీసరలో కారు చెట్టును ఢీకొని పల్టీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా ఓ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. మద్యం మత్తులో కారు నడపడంతోనే అదుపు తప్పి పల్టీలు కొట్టిందని స్థానికులు తెలిపారు. రాజేందర్ అనే విద్యార్థి ఘటనా స్థలంలోనే మరణించగా విశ్వ, యశ్వంత్లకు తీవ్రగాయలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. రాజేందర్ స్వస్థలం జగిత్యాల జిల్లా ధర్మపురిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
మద్యం మత్తులో చెట్టును ఢీకొని ఇంజినీరింగ్ స్టూడెంట్ మృతి, మరో ఇద్దరికి గాయాలు
Published : Jul 6, 2024, 6:46 PM IST
Car Accident In Medchal Dist : మేడ్చల్ జిల్లా కీసరలో కారు చెట్టును ఢీకొని పల్టీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా ఓ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. మద్యం మత్తులో కారు నడపడంతోనే అదుపు తప్పి పల్టీలు కొట్టిందని స్థానికులు తెలిపారు. రాజేందర్ అనే విద్యార్థి ఘటనా స్థలంలోనే మరణించగా విశ్వ, యశ్వంత్లకు తీవ్రగాయలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. రాజేందర్ స్వస్థలం జగిత్యాల జిల్లా ధర్మపురిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.