Tummala Wrote Letter to CM Revanth on TTD Darshan : తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఇవాళ హైదరాబాద్లో ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీ కానున్న నేపథ్యంలో తిరుపతి దర్శనంపై లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
తిరుపతి దర్శనం కోసం వెళ్లే భక్తుల సౌకర్యార్థం కోసం తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ సమావేశంలో సీఎం రేవంత్ కోరాలంటూ లేఖలో పేర్కొన్నారు. కోట్లాది మంది భక్తులు పూజించే తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్లే భక్తులకు వసతి, దర్శనం సంబంధించి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు టీటీడీ అధికారులు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తి చేయాలని కోరారు. దీనికోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని రేవంత్కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.