Two People Died After Swimming in Quarry Pit In Medak : మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద ఉన్న క్వారీ గుంతలో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. మంగళవారం సాయంత్రం ముగ్గురు యువకులు ఈతకు వెళ్లగా అందులో డప్పు నవీన్ (22), రాము(24) అనే ఇద్దరు నీట మునిగి మృతి చెందారు. గట్టు మీద ఉన్న మరో యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయి విషయాన్ని ఎవరికి చెప్పకుండా దాచాడు.
క్వారీ గుంతలో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి
Published : Aug 28, 2024, 3:35 PM IST
Two People Died After Swimming in Quarry Pit In Medak (ETV Bharat)
ఈ విషయం బుధవారం వెలుగులోకి రావడంతో ఘటన స్థలానికి పోలీసులు వెళ్లి పరిశీలించి గజ ఈతగాళ్లతో మృతదేహాలను బయటికి తీశారు. అనంతరం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.