By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 25, 2024, 9:12 PM IST
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదాలు - ముగ్గురు మృతి
Three People Died in Road Accident at Kurnool District :ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందికొట్కూరు నుంచి కర్నూలుకు వస్తున్న ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలోని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే కర్నూలులోని దేవనకొండ మండలం కరివేముల వద్ద ఆటో బోల్తా పడి మరొకరు మృతి చెందారు.