హోంగార్డును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు - అక్కడికక్కడే మృతి చెందిన సుబ్బరాజు
Published : 19 hours ago
Accident in Jagityal Distrct : జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో హోంగార్డు సుబ్బరాజు మృతి చెందాడు. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో సుబ్బరాజు హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ మెట్పల్లిలో నివాసముంటున్నాడు. ఉదయం కుటుంబ సభ్యులకు టిఫిన్ తీసుకురావడం కోసం హోటల్కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో నిజామాబాద్ నుంచి వరంగల్ వెళుతున్న ఆర్టీసీ బస్సు సుబ్బరాజు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయాలు అవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. దసరా పండుగకు ముందే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, కేసు నమోదు చేశారు.