మైనర్ బాలికపై లైంగిక దాడి - నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 27, 2024, 7:30 PM IST
![మైనర్ బాలికపై లైంగిక దాడి - నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష Sexual_Assault_on_Minor_Girl_Case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-05-2024/1200-675-21572237-thumbnail-16x9-sexual-assault-on-minor-girl-case.jpg)
Sexual Assault on Minor Girl Case: మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. కర్నూలు జిల్లా హొళగుంద మండలానికి చెందిన రంగముని 2021 ఆగస్టు 13న మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై అదే రోజు హొళగుంద పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై కర్నూలులోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపింది. నేరం రుజువు కావటంతో పోక్సో చట్టం కింద రంగమునికి జీవిత ఖైదు సహా 20 వేల రూపాయలు జరిమానా విధించింది. 20 వేలు చెల్లించకపోతే అదనంగా మరో మూడేళ్లు ఖైదు అనుభవించాలని న్యాయవాది భూపాల్ రెడ్డి తీర్పు వెలువరించారు. మరోవైపు మనవరాలిపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది విశాఖ పోక్సో ప్రత్యేక కోర్టు. ఐదో తరగతి బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి జైలుశిక్షతో పాటు రూ.5 లక్షల జరిమానా విధించింది.