Retire IAS Home Looted in Hyderabad :హైదరాబాద్లో ఓ విశ్రాంతి ఐఏఎస్ అధికారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. నగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంధం గూడలో ఉంటున్న రిటైర్ ఐఏఎస్ అధికారి హరిబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి జులై 3న విజయవాడకు వెళ్లారు. తిరిగి మంగళవారం ఇంటికి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు.
Published : Jul 9, 2024, 4:42 PM IST
విశ్రాంతి ఐఏఎస్ అధికారి ఇంట్లో భారీ చోరీ - 100 తులాల బంగారం అపహరణ
Retire IAS Home Looted in Hyderabad (ETV Bharat)
దీంతో హరిబాబు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించారు. 100 తులాల బంగారంతో పాటు ఓ ల్యాప్టాప్, విలువైన వస్తువులు చోరీ అయినట్లు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.