national

ETV Bharat / snippets

తీర్థయాత్రలకు వెళ్లి వస్తుండగా ట్రావెల్​ బస్సు బోల్తా - 8 మందికి గాయాలు

By ETV Bharat Telangana Team

Published : Jun 5, 2024, 3:53 PM IST

Road Accident In Siddipet Dist
Road Accident In Siddipet Dist (ETV Bharat)

Road Accident In Siddipet Dist : సిద్దిపేట జిల్లా నార్సింగి మండలం వల్లూరు 44 వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్, ఖమ్మంకు చెందిన పలువురు మినీ ట్రావెల్స్ బస్సులో కాశీ, అయోధ్య తీర్థయాత్రలు ముగించుకుని తమ స్వగ్రామాలకు వెళుతున్న క్రమంలో వల్లూరు శివారులోకి రాగానే వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 21 మంది ఉండగా 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108లో మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై ట్రావెల్స్​ బస్సు బోల్తాపడడంతో గంటపాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

ABOUT THE AUTHOR

...view details