national

ఆమదాలవలసలో బోగస్ పింఛన్లు - పట్టించుకోని ఎంపీడీవో - టీడీపీ నేతల ఆగ్రహం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 3, 2024, 3:35 PM IST

Amadalavalasa General Meeting Rasabhasa
Amadalavalasa General Meeting Rasabhasa (ETV Bharat)

Amadalavalasa General Meeting Rasabhasa :శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. సర్వసభ్య సమావేశం ఎంపీపీ తమ్మినేని శారద అధ్యక్షతన జరిగింది. కనుగులవలసలో బోగస్ పింఛన్లలో అధికారుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బోగస్ పింఛన్లపై ఫిర్యాదు చేసినా ఎంపీడీవో పట్టించుకోలేదని విమర్శించారు. ఒకే ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరికీ పింఛను ఎలా ఇస్తారని అధికారులను నిలదీశారు. ఈ సమస్యను జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని నేతలు అన్నారు.

ABOUT THE AUTHOR

...view details