By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 21, 2024, 5:25 PM IST
కాలేజీ విద్యార్థులే టార్గెట్ - గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్
Police Arrested Ganja Selling Gang in Guntur District : గుంటూరు జిల్లా తెనాలి మండలం కఠెవరంలో 2 కిలోల గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా విశాఖ నుంచి గంజాయి తెచ్చి కళాశాల విద్యార్థులకు విక్రయిస్తున్నారు. పోలీసులు నిఘా పెట్టి ముఠాలోని మైనర్ బాలుడితో సహా నలుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ రమేష్ తెలిపారు. ఈ ముఠా కాలేజీ విద్యార్థులనే టార్గెట్గా చేసుకోని విక్రయిస్తున్నారని వెల్లడించారు. యువతను గంజాయికి బానిసలు మారుస్తున్న వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.