national

డబ్బు కోసం అన్నదమ్ముల చోరీలు - 12 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 9, 2024, 5:51 PM IST

Police Arrested by Two Youngsters
Police Arrested by Two Youngsters (ETV Bharat)

Police Arrested by Two Youngsters Stealing Vehicles:సత్యసాయి జిల్లా ధర్మవరంలో చెడు వ్యసనాలకు బానిసలై ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. కూలి పని చేసుకుంటూ జీవనం చేస్తున్న రాకేష్, సతీష్ కుమార్ అనే ఇద్దరు అన్నదమ్ములు ద్విచక్ర వాహనాలను చోరీ చేసి వాటిని విక్రయించి మద్యం తాగడంతో పాటు జల్సాలు చేసేవారని పోలీసులు పేర్కొన్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడటంతో డబ్బు కోసం వాహనాల చోరీని ఎంచుకున్నారని తెలిపారు. నగరంలో వరుసగా వాహనాల చోరీ జరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదులు అందడంతో వాళ్లిద్దరిని పోలీసులు పట్టుకున్నారు. యువకులు దాచిన 12 ద్విచక్ర వాహనాలు, ఐదు లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వారిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details