విడిపోయిన దంపతులు- తండ్రితో మాట్లాడిందని కుమార్తెకు వాతలు పెట్టిన తల్లి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 31, 2024, 3:54 PM IST
Mother Scolded her Daughter for Talking to her Father : కుమార్తెపై ఓ కన్నతల్లి అమానవీయంగా గరిటెను కాల్చి వాతలు పెట్టిన ఘటన వైఎస్సార్ జిల్లాలో జరిగింది. సింహాద్రిపురం మండలం రావులకోలను గ్రామానికి చెందిన దంపతుల మధ్య విభేదాలు నెలకొనడంతో వేర్వేరుగా ఉంటున్నారు. వీరి కుమార్తె (14) తల్లి సంరక్షణలో ఉంటోంది. అప్పుడప్పుడు తల్లికి తెలియకుండా తండ్రితో ఫోన్లో మాట్లాడుతుండేది. కొద్దిరోజులుగా తండ్రి అనారోగ్యానికి గురవ్వడంతో ఈ నెల 28న ఫోన్చేసి యోగక్షేమాలు తెలుసుకుంది. ఈ విషయం తల్లికి తెలియడంతో కుమార్తె చేతులపై వాతలు పెట్టారు. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం పులివెందుల వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న తండ్రి ఆ చిన్నారితో పోలీస్స్టేషన్కొచ్చి తల్లిపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.