గుణదల రైల్వే పై వంతెన నిర్మాణం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం: ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 27, 2024, 1:28 PM IST
MLA Bonda Umamaheswara Rao About Gunadala Railway Bridge :ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏళ్ల తరబడి అసంపూర్తిగా మిగిలి ఉన్న గుణదల రైల్వే పై వంతెనను త్వరితగతిన పూర్తి చేస్తామని, గుణదల ప్రాంతంలో అత్యంత అవసరం అయిన ఈ వంతెనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేసే బాధ్యత తమదని విజయవాడ సెంట్రల్ నియోజవర్గం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. గుణదల ప్రాంతంలో దశాబ్ధాలుగా అసంపూర్తిగా ఉన్న రైల్వే పై వంతెన ను ఆయన స్వయంగా పరిశీలించి అధికారులతో కలిసి పునర్నిర్మాణ పనులకు కావలసిన అనుమతులపై అరా తీశారు.