రెట్టింపు లాభం పేరుతో మహిళకు బురిడీ - కేజీ బంగారంతో ఉడాయించిన వ్యక్తి
Published : 20 hours ago
Man Fraud woman and stole Gold in Jubilee Hills :రెట్టింపు లాభం పేరుతో మహిళను బురిడీ కొట్టించి ఏకంగా కేజీ బంగారంతో వ్యక్తి ఉడాయించిన ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. వారం రోజుల్లో పెట్టుబడి రెట్టింపు చేసి లాభం ఇస్తామని పది రోజులైనా బంగారం తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గుర్తించింది. దీంతో బాధిత మహిళ కార్తిక్రెడ్డి అనే వ్యక్తిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, మోసం చేసిన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు.