Legal notices to Padi Kaushik Reddy : మంత్రి పొన్నం ప్రభాకర్పై నిరాధార ఆరోపణలు చేసినందుకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు అందాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ పరువుకు భంగం కలిగించారంటూ ఆయన అడ్వకేట్ పూర్ణచందర్ రావు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా సరైన సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
మంత్రిపై నిరాధార ఆరోపణలు - ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు
Published : Jun 23, 2024, 1:20 PM IST
MLA Kaushik Reddy Comments on Minister Prabhakar (ETV Bharat)
ఎన్టీపీసీ నుంచి ఉత్పత్తి అయ్యే బూడిదను డబ్బులు తీసుకుని అధిక లోడ్తో లారీల్లో తీసుకెళ్లేందుకు మంత్రి పొన్నం అనుమతి ఇస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. దీనిపై మంత్రి లీగల్ టీమ్ స్పందించి ఆయనకు నోటీసులు పంపించింది. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేసింది.