national

నాగర్​ కర్నూల్​ నుంచి శ్రీశైలం వెళ్లే రోడ్​ బంద్​ - ఎందుకో తెలుసా?

By ETV Bharat Telangana Team

Published : Sep 1, 2024, 4:07 PM IST

Landslide Collapse in Nagar Kurnool District
Landslide Collapse in Nagar Kurnool District (ETV Bharat)

Landslide Collapse in Nagar Kurnool District : గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నాగర్​ కర్నూలు జిల్లాలో శ్రీశైలం వెళ్లే దారి ప్రమాదకరంగా మారింది. మన్ననూరు నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో దోమలపెంట దగ్గర కొండచరియలు విరిగి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్షం ఆగే వరకు శ్రీశైలం వెళ్లే ప్రయాణాలను వాయిదా వేయాల్సిందిగా నాగర్​ కర్నూల్​ జిల్లా ఎస్పీ గైక్వాడ్​ వైభవ్​ రఘునాథ్​ కోరారు.

శ్రీశైలం వెళ్లే వాహనాలను మన్నునూరు దగ్గర ఆపివేస్తున్నారు. వెల్దండ మండలం కొట్రతండా వద్ద చెక్​పోస్టు ఏర్పాటు చేసి శ్రీశైలం వెళ్లకుండానే వాహనాలను వెనుకకు మళ్లిస్తున్నారు. రోడ్డు సమస్య తీరే వరకూ ఎవరూ శ్రీశైలం రహదారిలో ప్రయాణించకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details