Landslide Collapse in Nagar Kurnool District : గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నాగర్ కర్నూలు జిల్లాలో శ్రీశైలం వెళ్లే దారి ప్రమాదకరంగా మారింది. మన్ననూరు నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో దోమలపెంట దగ్గర కొండచరియలు విరిగి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్షం ఆగే వరకు శ్రీశైలం వెళ్లే ప్రయాణాలను వాయిదా వేయాల్సిందిగా నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ కోరారు.
నాగర్ కర్నూల్ నుంచి శ్రీశైలం వెళ్లే రోడ్ బంద్ - ఎందుకో తెలుసా?
Published : Sep 1, 2024, 4:07 PM IST
Landslide Collapse in Nagar Kurnool District (ETV Bharat)
శ్రీశైలం వెళ్లే వాహనాలను మన్నునూరు దగ్గర ఆపివేస్తున్నారు. వెల్దండ మండలం కొట్రతండా వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేసి శ్రీశైలం వెళ్లకుండానే వాహనాలను వెనుకకు మళ్లిస్తున్నారు. రోడ్డు సమస్య తీరే వరకూ ఎవరూ శ్రీశైలం రహదారిలో ప్రయాణించకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.