national

సిద్ధాంతం కోసం నిల‌బ‌డ్డ నాయ‌కుడు సీతారాం ఏచూరి: కేటీఆర్​

By ETV Bharat Telangana Team

Published : 8 hours ago

KTR AT RAVINDRA BHARATHI
KTR PARTICIPATED SITHARAM YECHURI MEMORIAL (ETV Bharat)

KTR ABOUT SITHARAM ACHURI:ప‌ద‌వుల చుట్టూ ప‌రిభ్రమించే నేటి రాజ‌కీయాల్లో స్థిరంగా, సిద్ధాంతం కోసం నిల‌బ‌డ్డ నాయ‌కుడు సీతారాం ఏచూరి అని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కొనియాడారు. ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియ‌ని, ఈ రోజుల్లో క‌డ‌దాకా క‌మ్యూనిస్టుగా బ‌తికిన ఆద‌ర్శ నేత సీతారం ఏచూరి మాత్రమే అని కేటీఆర్ పేర్కొన్నారు. ర‌వీంద్ర భార‌తిలో నిర్వహించిన సీతారాం ఏచూరి సంస్మర‌ణ స‌భ‌లో కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం సీతారం ఏచూరి చిత్రప‌టానికి నివాళుల‌ర్పించారు. ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డలుగా ఏచూరీతో తమ బంధం రక్త సంబంధం అని పేర్కొన్నారు.

నమ్మిన సిద్ధాంతం కోసం ఆఖరి వరకు పోరాడిన ఏచూరి జీవితం తనలాంటి వారికి ఆదర్శం అని అన్నారు. తాము ఓట్ల రాజ‌కీయంలో వెనుక‌బ‌డ్డా ప్రజ‌ల కోసం పోరాటంలో మాత్రం ముందున్నామని, ప్రజ‌ల మ‌న‌సుల్లో ఉన్నామ‌ని సీతారాం ఏచూరి చెప్పిన మాటలు ఇప్పటికీ తనకు గుర్తున్నాయన్నారు.

ABOUT THE AUTHOR

...view details