PC Ghosh Commission Inquiry Updates :కాళేశ్వరం ఆనకట్టల విషయంలో ఎన్డీఎస్ఏ నిబంధనలను రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ పాటించిందా లేదా అని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ సీఈ ప్రమీల, ఇంజినీర్లు, సీడీఓ ఇంజినీర్లు శుక్రవారం కమిషన్ ముందు హాజరయ్యారు. ఎన్డీఎస్ఏ, ఇండియన్ డ్యాం సేఫ్టీ నిబంధనలను రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ పాటిస్తుందా లేదా అని జస్టిస్ ఘోష్ ప్రశ్నించారు.
'ఎన్డీఎస్ఏ నిబంధనలను రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ పాటించిందా లేదా?'
Published : 11 hours ago
PC Ghosh Commission Inquiry Updates (ETV Bharat)
మూడు బ్యారేజీల నిర్మాణానికి ముందు మాన్సున్ రిపోర్ట్ ఇవ్వలేదని రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ సీఈ ప్రమీల కమిషన్ ముందు చెప్పారు. కుంగుబాటుకు ముందు, తరవాత సైతం స్టేట్ డ్యాం సేఫ్టీ అధికారులకు ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయి అధికారుల నుంచి పూర్తిస్థాయి నివేదికలు అందలేదని రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ, సీడీఓ ఉన్నతాధికారులు కమిషన్కు వివరించారు.