national

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2024, 8:04 AM IST

ETV Bharat / snippets

ఆ విజిలెన్స్‌ అధికారులకు జీతాలివ్వొద్దు : ఆమ్రపాలి

GHMC COMMISSIONER ON HYDRA
GHMC COMMISSIONER AMRAPALI ON VIGILANCE OFFICERS (ETV Bharat)

GHMC Commissioner Amrapali on Vigilance Officers : జీహెచ్‌ఎంసీలో జీతం తీసుకుంటూ, హైడ్రాలో పని చేస్తున్న అధికారులపై బల్దియా కమిషనర్‌ ఆమ్రపాలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణలు, రోజువారీ కార్యక్రమాలు, నివేదికల రూపకల్పనలో విజిలెన్స్‌ అధికారుల అవసరం ఉందని, కానీ వారు ఆ బాధ్యతలను నిర్వర్తించడం లేదని గురువారం స్థాయీ సంఘం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆమె స్పందించారు.

జీహెచ్‌ఎంసీలోని పూర్వ విజిలెన్స్‌ విభాగం ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వులతో యథాతథంగా అమల్లోకి వచ్చినా సంబంధిత అధికారులు మాత్రం హైడ్రాలోని పనిచేస్తున్నారు. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్​కు జవాబుదారీగా ఉంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. దీంతో తమ పరిధిలో పని చేయని అధికారులకు ఇకపై జీతాలు ఇవ్వొద్దు అని కమిషనర్‌ ఆమ్రపాలి పరిపాలన విభాగాన్ని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details