GHMC Commissioner Amrapali on Vigilance Officers : జీహెచ్ఎంసీలో జీతం తీసుకుంటూ, హైడ్రాలో పని చేస్తున్న అధికారులపై బల్దియా కమిషనర్ ఆమ్రపాలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణలు, రోజువారీ కార్యక్రమాలు, నివేదికల రూపకల్పనలో విజిలెన్స్ అధికారుల అవసరం ఉందని, కానీ వారు ఆ బాధ్యతలను నిర్వర్తించడం లేదని గురువారం స్థాయీ సంఘం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆమె స్పందించారు.
Published : Sep 13, 2024, 8:04 AM IST
ఆ విజిలెన్స్ అధికారులకు జీతాలివ్వొద్దు : ఆమ్రపాలి
GHMC COMMISSIONER AMRAPALI ON VIGILANCE OFFICERS (ETV Bharat)
జీహెచ్ఎంసీలోని పూర్వ విజిలెన్స్ విభాగం ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వులతో యథాతథంగా అమల్లోకి వచ్చినా సంబంధిత అధికారులు మాత్రం హైడ్రాలోని పనిచేస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు జవాబుదారీగా ఉంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. దీంతో తమ పరిధిలో పని చేయని అధికారులకు ఇకపై జీతాలు ఇవ్వొద్దు అని కమిషనర్ ఆమ్రపాలి పరిపాలన విభాగాన్ని ఆదేశించారు.