By ETV Bharat Andhra Pradesh Team
Published : 19 hours ago
మంత్రి నారాయణ పరువు నష్టం కేసు - రద్దు చేయాలని హైకోర్టులో జగన్ పిటిషన్
High Court Hearing on the Petition Filed by YS Jagan:మంత్రి నారాయణ దాఖలు చేసిన పరువు నష్టం కేసును రద్దు చేయాలని కోరుతూ వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని మంత్రి నారాయణకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 15కి న్యాయస్థానం వాయిదా వేసింది. తనపై అసత్య ఆరోపణలతో సాక్షి పేపరులో కథనాన్ని ప్రచురించారని గతంలో మంత్రి నారాయణ విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది.