రాచకొండ పరిధిలో భారీగా పట్టుబడిన డ్రగ్స్
Published : 4 hours ago
SEIZED DRUGS IN HYDERABAD:రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్వోటీ పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. రెండు వేర్వేరు ఘటనల్లో హాష్ ఆయిల్, గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మీర్పేట పరిధిలోని నలుగురు సభ్యులున్న ముఠాను అరెస్టు చేశారు. వారి నుంచి 2.5 లీటర్ల హాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఆదిభట్ల పరిధిలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న నిందితుడ్ని అరెస్టు చేశారు. అతడి నుంచి 3.8 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులకు సంబంధించి రాచకొండ కమిషనరేట్ సీపీ సుధీర్ బాబు మధ్యాహ్నం వివరాలు వెల్లడించనున్నారు.