Geophysical Tests in Annaram Barrage : ఎన్డీఎస్ఏ ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీ వద్ద నీటి పరిశోధన బృందం జియో ఫిజికల్ పరీక్షలను ప్రారంభించింది. పుణేకు చెందిన శాస్త్రవేత్త ధనుంజయ నాయుడు నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ సంస్థ డిప్యూటీ సీఈ నాగలక్ష్మి, ఈఈ శ్రీలత, డిప్యూటీ ఈఈ సతీశ్ కుమార్ సమక్షంలో పలు పరీక్షలను నిర్వహించారు.
అన్నారం బ్యారేజీలో మొదలైన జియో ఫిజికల్ పరీక్షలు - త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక
Published : Jun 22, 2024, 7:07 AM IST
Geophysical Tests in Annaram Barrage (ETV Bharat)
సీపేజీలు ఏర్పడిన ప్రాంతంలో పరీక్షలు నిర్వహించారు. తొలుత అత్యాధునికమైన జియో రాడర్ పరికరంతో 34వ వెంట్ వద్ద పరీక్ష చేశారు. రాడర్ పరికరాన్ని ఆ ప్రాంతంలో తిప్పుతూ స్కానింగ్ చేశారు. మరో రకమైన పార్టర్ సెస్మిక్ వేచ్ పద్ధతి ద్వారా బోర్వెల్ రంధ్రం నుంచి సుమారు 25 మీటర్ల కేబుల్ తీగను లోపలి భాగంలోకి పంపుతూ పరీక్షలు చేశారు. పరీక్షలు పూర్తి అయిన తర్వాత రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.