national

ETV Bharat / snippets

బాపట్ల జిల్లాలో విషాదం - వాగులో స్నానానికి దిగి నలుగురు యువకులు గల్లంతు

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 29, 2024, 1:23 PM IST

four_youths_drowned_in_river
four_youths_drowned_in_river (ETV Bharat)

Four Youths Drowned in river at Bapatla Districtl:బాపట్ల శివారు నల్లమడ వాగులో ఈత కొట్టడానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు. స్నానం కోసం నదిలోకి దిగి కొట్టుకుపోయారు. వేసవి నుంచి ఉపశమనం పొందడం కోసం హైదరాబాద్‌ నుంచి సూర్యలంక బీచ్‌కు వచ్చినట్లు యువకుల తల్లిదండ్రులు తెలిపారు. బుధవారం ఉదయం పర్యటక కేంద్రం సూర్యలంక బీచ్‌కు వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో నల్లమడ వాగులో స్నానానికి దిగారు. తొలుత ప్రవాహ ఉద్ధృతికి ఒకరు కొట్టుకుని పోయారు. అతడిని రక్షించే క్రమంలో మిగతా ముగ్గురు గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. తమ బిడ్డలను ఎలాగైనా రక్షించాలని పోలీసులను యువకుల తల్లిదండ్రులు ప్రాధేయపడ్డారు. గల్లంతైన వారికోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు హైదరాబాద్‌కు చెందిన సన్నీ, సునీల్, గిరి, నందుగా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details