గత ప్రభుత్వ హయాంలోని పెండింగ్ బిల్లులపై ఆర్థిక శాఖ ఆరా - వివరాలు పంపాలని అన్ని శాఖలకూ లేఖలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 2, 2024, 9:14 PM IST
Finance Department Collects Information on Pending Bills of Previous Government : గత ప్రభుత్వ హయాంలోని పెండింగ్ బిల్లులపై ఆర్థిక శాఖ సమాచారం సేకరిస్తోంది. ఈ మేరకు వివరాలు పంపాలని అన్ని శాఖలకూ ఆర్థిక శాఖ లేఖలు రాసింది. పెండింగ్ బిల్లులపై కొన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు అరకొరగా సమాచారం ఇస్తున్నారు. శ్వేతపత్రం విడుదల కోసం చేస్తున్న కసరత్తులో పెండింగ్ బిల్లులపై అరకొర సమాచారం ఇవ్వడం పట్ల ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల అసహనం వ్యక్తంచేశారు. పెండింగ్ బిల్లులపై పూర్తి సమాచారం కోసం మరోసారి లేఖలు రాయాలని అధికారులను ఆదేశించారు. సమాచారం ఇవ్వని అధికారులపై చర్యలు ఉంటాయని లేఖలో పేర్కొనాలని స్పష్టం చేశారు.