వైఎస్సార్సీపీకి మరో షాక్ - పార్టీకి రాజీనామా చేసిన ఏలూరు మేయర్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 26, 2024, 10:38 PM IST
Eluru Mayor Shaik Noorjahan Resign to YSRCP :వైఎస్సార్సీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలంతా ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతుండగా తాజాగా ఆ జాబితాలో మరొకరు చేరారు. ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. సీఎం చంద్రబాబు సమక్షంలో మంగళవారం మేయర్ దంపతులు తెలుగుదేశంలో చేరనున్నారు. మేయర్ దంపతులతో పాటు పలువురు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకోనున్నారు. మేయర్, కార్పొరేటర్ల చేరికతో ఏలూరు నగరపాలికపై టీడీపీ పట్టు సాధించనుంది.