ఆగస్టు 5న కలెక్టర్లలతో సీఎం చంద్రబాబు సమావేశం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 29, 2024, 3:46 PM IST
Collectors Meeting at Secretariat: ఆగస్టు 5వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే సమావేశానికి మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తూ వస్తోంది. అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను భారీగా బదిలీలు చేసింది. వారంతా కొత్త బాధ్యతలను ఇప్పటికే స్వీకరించారు. అదే విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పాత వారిని బదిలీ చేసి, జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. తాజాగా వచ్చే నెల 5న కలెక్టర్లలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు.