పద్మశ్రీ గ్రహీతలకు రూ.25 లక్షల చెక్కులు పంపిణీ చేసిన సీఎం రేవంత్
Published : Jul 10, 2024, 7:30 PM IST
RS 25 Lakhs Checks to Padma Shri Winners in Telangana (ETV Bharat)
RS 25 Lakhs Checks to Padma Shri Winners in Telangana :రాష్ట్ర పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు సీఎం రేవంత్ రెడ్డి నగదును బహుమతిగా అందించారు. ఒక్కొక్కరికీ రూ.25 లక్షల చొప్పున చెక్కులను సీఎం పంపిణీ చేశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, వేలు ఆనందచారి నగదును ఇచ్చారు. అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కూరేళ్ల విఠలాచార్య, కేతావత్ సోంలాల్కు సీఎం రేవంత్ రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు.