అశ్వారావుపేట ఎస్సై ఆత్మహత్యాయత్నం - పలువురి పోలీసులపై కేసు నమోదు
Published : Jul 6, 2024, 2:12 PM IST
Case On Few for Aswaraopet SI Suicide Attempt : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాములు శ్రీను ఆత్మహత్యాయత్నం కేసులో పలువురిపై కేసు నమోదు చేశారు. శ్రీరాములు శ్రీను ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఎస్సై శ్రీరాముల శ్రీను ఆత్మహత్యాయత్నానికి కారుకులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అశ్వరావుపేట సీఐ జితేందర్ రెడ్డితో పాటు కానిస్టేబుళ్లు శేఖర్, సన్యాసినాయుడు, శివ నాగరాజు, సుభానిలను విజన్ నుంచి తొలగించాలని దళిత సంఘం నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో సీఐ జితేందర్రెడ్డి, కానిస్టేబుళ్లు శేఖర్, శివనాగరాజు, సన్యాసినాయుడు, సుభానిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.