national

గుడ్​న్యూస్​ - కొత్త రేషన్ కార్డుల జారీకి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు

By ETV Bharat Telangana Team

Published : Aug 8, 2024, 10:21 PM IST

Cabinet Sub Committee On Ration Cards
Cabinet Sub Committee On Ration Cards (ETV Bharat)

Cabinet Sub Committee On Ration Cards :కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటయ్యింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛైర్మన్​గా, దామోదర రాజనర్సింహా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. ఇటీవల కేబినెట్ నిర్ణయం మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీకి అర్హతలు, విధివిధానాలను మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేస్తుంది. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు వేర్వేరుగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. రేషన్ కార్డుల కోసం వార్షికాదాయం, భూ పరిమితి తదితర అంశాలపై సబ్ కమిటీ అధ్యయనం చేయనుంది.

ABOUT THE AUTHOR

...view details