national

By ETV Bharat Telangana Team

Published : Aug 4, 2024, 10:27 PM IST

ETV Bharat / snippets

'8 ఎంపీ స్థానాలు గెలవడం శుభ సంకేతం - తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు'

BJP Leader BL Santhosh Meeting
BJP Leader BL Santhosh Meeting Hyderabad (ETV Bharat)

BJP Leader BL Santhosh Meeting Hyderabad: తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందని, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోశ్​ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో బీఎల్ సంతోశ్​ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు గెలవడం శుభ సంకేతమని, పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ ముందుకుపోవాలని సూచించారు. అంతా కలి‌సి కట్టుగా పని చేయాలని, అందరినీ కలుపుకొని పోయి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ప్రజా సమస్యలపై తీసుకున్న పోరాటాలపై బీఎల్ సంతోశ్​ ఆరా తీశారు. పార్టీ బలహీనంగా ఉన్న చోట మరింత కష్టపడి పని చేయాలని స్పష్టం చేశారు. అనంతరం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్​తో బీఎల్ సంతోశ్​ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో బీజేపీ కార్యకలాపాలపై ఆరా తీశారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు.

ABOUT THE AUTHOR

...view details