ప్రభుత్వ పథకాల కేటాయింపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అన్యాయం చేశాయని కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు బీడీ కార్మికులు మొరపెట్టుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ గతంలో పలుమార్లు ఢిల్లీకి, హైదరాబాద్కు వెళ్లి మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చినా ఎలాంటి ప్రయోజనం లేదని వారు బండి సంజయ్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ ముద్దుబిడ్డగా తమను ఆదుకోవాలని మహిళలు మంత్రికి విజ్ఞప్తి చేశారు.
మమ్మల్ని ఆదుకోండి సారూ - బండి సంజయ్కు బీడీ కార్మికుల విజ్ఞప్తి
Published : Aug 31, 2024, 5:28 PM IST
|Updated : Aug 31, 2024, 8:19 PM IST
BANDI SANJAY IN KARIMNAGAR (ETV Bharat)
కరీంనగర్ నగరంలో ఇవాళ తన పర్యటనలో మంత్రి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మించే పనులకు భూమిపూజ చేశారు. కొత్తపల్లి మండల చెరువు వద్ద రూ.2 కోట్ల 65 లక్షలతో నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జ్ను మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 13, 28 డివిజన్లలో పలు సంఘాల కమ్యూనిటీ భవనాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.
Last Updated : Aug 31, 2024, 8:19 PM IST