national

ETV Bharat / snippets

నందిగం సురేష్‌, బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు నమోదు

Case_on_Nandigam_Suresh_and_Borugadda_Anil
case on Nandigam Suresh and Borugadda Anil (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 26, 2024, 3:44 PM IST

Case Registered on Nandigam Suresh and Borugadda Anil: వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు నమోదైంది. గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్​లో హత్యాయత్నం కేసు నమోదైంది. 2023 మార్చి 31న బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేశారు. రాజధాని రైతులకు సంఘీభావం తెలిపి వెళ్తుండగా, సత్యకుమార్​పై వైఎస్సార్సీపీ మూకలు దాడికి తెగబడ్డారు.

దాడి ఘటనలో ఏ1గా నందిగం సురేష్‌, ఏ2గా బోరుగడ్డ అనిల్‌ ఉన్నారు. దాడిలో కొందరు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో హత్యాయత్నం సెక్షన్ల క్రింద కేసు పెట్టారు. మొత్తం 25 మందిని నిందితులుగా చేర్చారు. ప్రస్తుతం వెలగపూడిలో జరిగిన మహిళ హత్య కేసులో నందిగం సురేష్ రిమాండ్ ఖైదీగా గుంటూరు జిల్లా జైలులో, డబ్బుల కోసం బెదిరించిన కేసులో బోరుగడ్డ అనిల్ అరెస్టై రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details