national

చిరుతను తప్పించబోయి కారు బోల్తా - మహిళ మృతి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 26, 2024, 3:21 PM IST

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

Road Accident In Nizamabad :అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తున్న కారుకు చిరుత అడ్డు రావడంతో దాన్ని తప్పించబోయి ఓ వాహనం బోల్తా కొట్టింది. ఈ క్రమంలో జరిగిన ప్రమాదంల ో మహిళ మృతి చెందగా ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో జరిగింది. మంగళవారం రాత్రి గాంధారి మండలం యాచారం గ్రామానికి చెందిన మాలోత్ ప్రభాకర్ అతని భార్య లలితలు మోపాల్ మండలంలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు.

కారులో సొంత గ్రామానికి తిరిగి వస్తుండగా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం ఎల్లమ్మకుంట శివారులో చిరుతను తప్పించబోయారు. ఈ క్రమంలోనే కారు బోల్తా పడింది. ఈ ఘటనలో చెందిన మాలోత్ లలిత(30) అక్కడికక్కడే మృతి చెందగా భర్త మాలోత్ ప్రభాకర్​కు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన ప్రభాకర్​ను జిల్లా ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఉదయం ఘటన స్థలాన్ని మోపాల్ పోలీసులు పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details