Vinesh Phogat Raksha Bandhan:భారత్ స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తన సోదరుడితో కలిసి రక్షబంధన్ జరుపుకొంది. తన స్వగ్రామంలో సోదరుడికి రాఖీ కట్టి రక్షాబంధన్ పర్వదినాన్ని జరుపుకొంది. ఈ సందర్భంగా తన సోదరుడు ఇచ్చిన గిఫ్ట్ను అభిమానులకు చూపుతూ వినేశ్ మురిసిపోయింది. ఆమె సోదరుడు తనకు రూ.500 నోట్ల కట్ట గిఫ్ట్గా ఇచ్చాడు. ఇది అతడి లైఫ్ జీవితకాలం సంపాదన అని వినేశ్ తెలిపింది.
వినేశ్ రాఖీ సెలబ్రేషన్స్- సోదరుడి స్పెషల్ గిఫ్ట్
Published : Aug 19, 2024, 3:59 PM IST
Vinesh Phogat Raksha Bandhan (Source: Associated Press)
'నాకు ఇప్పుడు 30ఏళ్లు. గతేడాది నాకు రూ. 500 ఇచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇది (రూ.500 నోట్ల కట్టను చూపిస్తూ). ఇది అతడి జీవిత కాల సంపాదన. నాకు ఇచ్చేశాడు. థాంక్యూ బద్రర్స్ అండ్ సిస్టర్స్' అని తన సోదరుడికి కట్టిన రాఖీని చూపిస్తూ వినేశ్ పేర్కొంది. కాగా, పారిస్ ఒలింపిక్స్లో అనర్హతకు గురైన వినేశ్ ఇటీవల దిల్లీకి వచ్చింది. దిల్లీ నుంచి స్వగ్రామం బలాలికి భారీ ర్యాలీతో వెళ్లింది.