లంకతో తొలి వన్డే - మ్యాచ్ డ్రా
Published : Aug 2, 2024, 10:15 PM IST
TEAMINDIA VS SRI LANKA First ODI Match Tied : టీమ్ఇండియా-శ్రీలంక మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్ టై అయింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేశారు. ఆ జట్టులో నిశాంక(56), దునీత్(67) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇండియా బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. సిరాజ్, దుబె, కుల్దీప్, సుందర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 231 పరుగుల లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 47.5 ఓవర్లో 230 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో మ్యాచ్ టై అయింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ (58) టాప్ స్కోరర్. అక్షర్ పటేల్ (33), కేఎల్ రాహుల్ (31), శివమ్ దూబె(25), కోహ్లీ (24) పరుగులు చేశారు. లంక బౌలర్లలో వనిందు హసరంగా, చరిత్ అసలంక తలో మూడు వికెట్లు తీశారు.