Rishabh Pant IPL :స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఐపీఎల్ కెరీర్లో మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన పంత్, రానున్న సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మారనున్నట్లు సమాచారం. మరో షాకింగ్ విషయం ఏంటంటే అతడ్ని ధోని స్థానంలోకి భర్తీ చేయాలని చెన్నై చూస్తోందట.
దిల్లీ వీడనున్న పంత్ - ఆ స్టార్ ప్లేయర్ కూడా అదే బాటలో!
Published : Jul 21, 2024, 10:21 AM IST
Rishabh Pant (Getty Images)
గతంలోనే ధోనీ ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ, అటువంటిదేం జరగలేదు. కానీ ఈ సారి మాత్రం ఈ విషయంపై పలు సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు ధోని ఆడతాడో లేదో కానీ పంత్ మాత్రం సీఎస్కేతో కలవడం ఖాయమని సమాచారం. ఇక లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ఆర్సీబీలో చేరనున్నాడట. ప్రస్తుతం ఇవి రూమర్స్గానే ఉన్నప్పటికీ, వీటిపై త్వరలో అధికారిక సమాచారం రానుందని టాక్ నడుస్తోంది.