పాక్ ప్లేయర్లకు గట్టి షాకిచ్చిన పీసీబీ!
Published : Jul 15, 2024, 8:06 PM IST
PCB Central Contract :పీసీబీ తమ ఆటగాళ్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అలానే ఆటగాళ్లను క్రమశిక్షణలో పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం ప్లేయర్స్ సెంట్రల్ కాంట్రాక్ట్ వ్యవధిని మూడేళ్ల నుంచి ఏడాదికి తగ్గించిందని తెలిసింది. వన్డే ప్రపంచకప్2023, టీ20 ప్రపంచకప్2024 టోర్నీ వైఫల్యాల నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుందట. ఇకపై ఆటగాళ్ల ఫిట్నెస్, ప్రవర్తనపై ఆధారంగా ప్రతీ ఏడాది సెంట్రల్ కాంట్రాక్ట్ను రివైజ్ చేయాలని బోర్డు భావిస్తోందట. అయితే, పారితోషికం విషయంలో మాత్రం ఎలాంటి కోత ఉండబోదట. ఈ మేరకు పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, రెడ్ బాల్ కోచ్ జేసన్ గిల్లెస్పి, వైట్ బాల్ కోచ్ గ్యారీ కిర్స్టెన్ చర్చించినట్లు సమాచారం అందింది. అలాగే పూర్తిస్థాయి ఫిట్నెస్ ఉన్న ప్లేయర్స్కే నిరంభ్యంతర పత్రాలు ఇవ్వాలని, అది కూడా కేవలం అంతర్జాతీయంగా ప్రాముఖ్యం కలిగి ఉన్న లీగ్లలో మాత్రమే ఆడేందుకు అనుమతినివ్వాలని యోచనలో ఉన్నారట.