Manu Bhaker Paris Olympics:పారిస్ ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన భారత షూటర్ మను బాకర్కు అరుదైన గౌరవం లభించింది. విశ్వ క్రీడల ముగింపు వేడుకల్లో మను బాకర్ వుమెన్ ఫ్లాగ్ బేరర్గా వ్యవహరించనుంది. ఈ విషయాన్ని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అఫీషియల్గా ప్రకటించింది. జులై 26న ప్రారంభమైన ఈ క్రీడలు ఆగస్టు 11న ముగియనున్నాయి. మరోవైపు పురుషుల నుంచి ఫ్లాగ్ బేరర్గా ఎవరు ఉండనున్నారన్నది తెలియాల్సి ఉంది.
మన షూటర్కు లక్కీ ఛాన్స్- ఫ్లాగ్ బేరర్గా మను బాకర్
Published : Aug 4, 2024, 12:12 PM IST
Manu Bhaker (Source: Associated Press)
కాగా, ప్రస్తుత ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో మూడు కాంస్య పతకాలు మాత్రమే ఉన్నాయి. అందులో రెండు బాకర్ సాధించినవే కావడం విశేషం. ఈమె 10మీటర్ల ఎయిర్ రైఫిల్ సింగిల్స్, 10మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లలో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని ముద్దాడింది. ఇక శనివారం జరిగిన 25మీటర్ల పిస్టల్ సింగిల్స్ ఈవెంట్ ఫైనల్లో త్రుటిలో పతకం చేజార్చుకుంది. ఈ ఈవెంట్లో మను నాలుగో స్థానంలో నిలిచింది.