national

ETV Bharat / snippets

మూడో మ్యాచ్‌లో టీమ్​ఇండియా అద్భుత విజయం - మహిళా టీ20 సిరీస్‌ సమం

By ETV Bharat Telugu Team

Published : Jul 9, 2024, 10:27 PM IST

source ANI
IND VS SouthAfrica T20 Series (source ANI)

IND VS SouthAfrica T20 Series : దక్షిణాఫ్రికా మహిళా జట్టుతో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో టీమ్​ఇండియా ఘన విజయం సాధించింది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం వల్ల రెండో మ్యాచ్‌ రద్దవడం వల్ల సిరీస్‌ 1-1తో సమంగా ముగిసింది. మొదట బ్యాటింగ్​కు దిగిన సౌతాఫ్రికాకు భారత్‌ బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో ఆ జట్టు 17.1 ఓవర్లలో 84 పరుగులకు ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్‌ చేసింది భారతజట్టు కేవలం 10.5 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. స్మృతి మంధాన (40 బంతుల్లో 54*; 8×4,2×6) హాఫ్​సెంచరీ బాదగా, షెఫాలీ వర్మ (25 బంతుల్లో 27*; 3×4) అద్భుత రాణించింది. కాగా, ఈ పర్యటనలో మూడు వన్డేల సిరీస్, ఏకైక టెస్టులో సఫారీ జట్టును టీమ్​ఇండియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details