Nishant Dev Olympics:పారిస్ ఒలింపిక్స్ బాక్సింగ్ ఈవెంట్లో భారత్కు ఎదురుదెబ్బ. శనివారం జరిగిన 71కేజీల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్ ఈవెంట్లో నిషాంత్ దేవ్ పోరాడి ఓడాడు. ఈ మ్యాచ్లో మెక్సికన్ బాక్సర్ మార్కో అలోన్సోతో తలపడ్డ నిషాంత్ గట్టిపోటీ ఇస్తూ చివరిదాకా పోరాడాడు. దీంతో అందరూ నిషాంత్దే విజయం అనుకున్నారు. కానీ, ఆఖర్లో అంపైర్ మెక్సికన్ బాక్సర్ను 3-2 పాయింట్లతో విజేతగా ప్రకటించడం వల్ల నిషాంత్ ఓటమి ఖరారైంది.
బాక్సింగ్లో భారత్కు అన్యాయం- నిషాంత్ నుంచి మెడల్ దోచేశారు!
Published : Aug 4, 2024, 7:15 AM IST
|Updated : Aug 4, 2024, 10:17 AM IST
కాగా,వరల్డ్ ఛాంపియన్షిప్ కాంస్యం విజేత నిషాంత్ దేవ్ క్వార్టర్స్లో ఓడడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరోవైపు ఈ మ్యాచ్లో స్కోరింగ్పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈమేరకు నిషాంత్కు మద్దతుగా మాజీ ఛాంపియన్ విజేందర్ సింగ్ పోస్ట్ షేర్ చేశాడు. 'పాయింట్లు ఎలా వేశారో అర్థం కాలేదు. నిషాంత్ నువ్వు బాధపడకు అద్భుతంగా పోరాడావు' అని అన్నాడు. 'విజయం నీదే, నీ నుంచి మెడల్ దోచేశారు' అని నటుడు రణ్దీప్ హుడా అన్నారు.