Virat Kohli Pakistan Visit:టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పాకిస్థాన్కు వస్తే భారత్ను మర్చిపోయే రీతిలో తమ అతిథి మర్యాదలు ఉంటాయని పాక్ మాజీ కెప్టెన్ షహీన్ అఫ్రిదీ అన్నాడు. విరాట్కు పాకిస్థాన్లో చాలామంది అభిమానులు ఉన్నారని తెలిపాడు. తాజాగా ఓ సందర్భంలో అఫ్రిదీ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'విరాట్ ఒకవేళ పాకిస్థాన్కు వస్తే భారత్కు మించి మా అతిథి మర్యాదలు ఉంటాయి. అతడికి ఇక్కడ అనేక మంది ఫ్యాన్స్ ఉన్నారు. విరాట్ పాకిస్థాన్లో ఆడితే చూడాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం' అని అఫ్రిదీ అన్నాడు.
'పాక్కు వస్తే భారత్ను మర్చిపోయేలా- విరాట్ కోసం మేమంతా వెయిటింగ్'
Published : Jul 12, 2024, 9:19 AM IST
Virat Kohli Pakistan Visit (Source: Associated Press)
కాగా, 2008లో అరంగేట్రం చేసిన విరాట్ ఇప్పటివరకు పాక్లో క్రికెట్ ఆడలేదు. ఇక 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తోంది. ఈ టోర్నీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్లాల్సి ఉంటుంది. కానీ, భద్రతాకారణాల దృష్యా టీమ్ఇండియా పాక్లో పర్యటించబోదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. భారత్ మ్యాచ్లన్ని తటస్థ వేదికల్లో నిర్వహించాల్సిందిగా ఐసీసీని కోరనుంది.