national

'పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ప్రభుత్వం అలా వ్యవహరించడం లేదు'

By ETV Bharat Telangana Team

Published : Aug 1, 2024, 7:08 PM IST

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

MLA's Case in High court : పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడం లేదని, ఫిరాయింపులను ప్రోత్సహించేలా వారి చర్యలున్నాయని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం అన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో మరోసారి వాదనలు జరిగాయి. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేసేలా ఆదేశించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌ రెడ్డి వాదనలు విన్నారు.

పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించే హక్కు హైకోర్టుకు ఉందని వాదించారు. ఈ మేరకు గతంలో పలు కోర్టులు ఇచ్చిన తీర్పులను చదివి వినిపించారు. ప్రతివాదుల తరఫు న్యాయవాదుల వాదనలు వినడానికి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details