కేంద్ర బడ్జెట్లో ఏపీకి భారీ కేటాయింపులు - కేంద్రమంత్రులకు చంద్రబాబు ఫోన్లో ధన్యవాదాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 24, 2024, 10:28 PM IST
CM Chandrababu Thanks to Finance Minister Nirmala Sitharaman : 2024-25 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులపై కేంద్ర మంత్రులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ లో సీఎం ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రం ఇచ్చిన ప్రతిపాదలు పరిశీలించి కేటాయింపులు జరిపినందుకు సీఎం కృతజ్ఞతలు చెప్పారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు రాష్ట్ర పునర్నిర్మాణంపై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.